భూములు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేవారికి ఏపీ సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది. రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి తేనున్నారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకూ స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం.