వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన బొత్స.. అనారోగ్యం నుంచి కోలుకుని శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. అయితే సభలో మాట్లాడుతున్న సమయంలో స్వల్ప అస్వస్థతకు గురై తూలిపడబోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ అప్రమత్తమై బొత్సను కిందపడకుండా పట్టుకున్నారు. దీంతో అసెంబ్లీ వర్గాలు వైద్యులను హుటాహుటిన అసెంబ్లీకి రప్పించాయి. బొత్సను పరీక్షించిన వైద్యులు.. బీపీ అధికంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అనంతరం వైద్యుల సూచనతో బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిసింది.