మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 35 రోజుల వ్యవధిలో సుమారుగా 5.13 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంత భారీ స్థాయిలో హుండీ ఆదాయం రావటమిదే తొలిసారని చెప్తున్నారు. అయితే బుధవారం నాటికి పూర్తి లెక్కలు తేలయనున్నాయి. ప్రస్తుతం చిల్లర నాణేల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.