Minister Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో ఈ తీర్పు వెలువడింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారం వంటి అంశాలపై కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారమని కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 21 లోపు కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.