బస్సు సౌకర్యం లేని గ్రామాలకు కొత్త సర్వీసు ప్రారంభించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ చూపించారు. దీంతో ఆ మార్గంలోని గ్రామాలు.. గత 15 ఏళ్లుగా బస్సు కోసం చూస్తున్న ఎదురుచూపులు ఫలించాయి. దీంతో వారు మంత్రి అడ్లూరికి ధన్యవాదాలు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తమ మార్గంలో బస్సు నడపాలని పలు గ్రామాల ప్రజలు కోరినా.. ఎవరూ పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి తమ గోడు విని స్పందించారని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.