మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెల్ఫోన్ చోరీకి గురైంది. కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫోన్ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కరీంపేటలోని ఓ మహిళ వద్ద ఫోన్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనంలో ఆమె పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.