భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఆగస్టు 27న వినాయక చవితి పండుగ. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్.. నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. అలానే వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం 30 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు. ఆ వివరాలు..