గజ్వేల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మహిళలకు చీరలు అందజేసి, వారి ఆనందాన్ని చూసి మురిసిపోయారు. "జయ జయహే తెలంగాణ" పాటతో ఆకట్టుకున్నారు. మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం అందిస్తోందని, సిద్దిపేటలో 11 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.