దక్షిణాది రాష్ట్రాలు కలిసి 'మేక్ ఇన్ సౌత్, స్కేల్ ఫర్ ది వరల్డ్' ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. సీఐఐ సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ దృష్టిలో జీడీపీ (GDP) అంటే గ్రాస్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ (జీఈపీ) (Gross Empowerment of People) అని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు.