Maoists Letter Seethakka: తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది! మంత్రి సీతక్కకు మావోయిస్టుల నుంచి హెచ్చరిక లేఖ అందింది. ఆదివాసీల హక్కుల విషయంలో సీతక్క స్పందించడం లేదని, ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, సీతక్క తన మాజీ నేపథ్యాన్ని విస్మరించారని విమర్శించారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై సీతక్క ఎలా స్పందిస్తారో చూడాలి