మందుబాబులకు ఇది చేదు వార్త! ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అంతేకాదు, ఆగస్టు 15, 16 తేదీల్లో మాంసం షాపులు కూడా బంద్ కానున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అధికారులు కోరుతున్నారు.