రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా మందుబాబుల జేబులకు చిల్లు పడనుంది. గ్యాస్ కొరత, సీసాల ఉత్పత్తి తగ్గిపోవడం, ధరల సమీక్ష గడువు ముగియడం వంటి కారణాలతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే మద్యం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో మద్యం ధరల పెంపు ఉండనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.