సూర్యాపేట జిల్లా రామాపురంలో భారీ నకిలీ మద్యం వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో 178 బ్రాండ్ల కల్తీ లిక్కర్, రూ. 2 కోట్ల విలువైన స్పిరిట్, ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు పట్టుబడ్డాయి. ఒరిజినల్ సీసాల్లో సగం నీరు, స్పిరిట్ కలిపి విక్రయిస్తున్నట్లు తేలింది. హైదరాబాద్లోని కృష్ణపద్మ స్పిరిట్ కంపెనీ నుంచి ముడిసరుకు తెచ్చి, ఏపీ సరిహద్దులోని రైస్ మిల్లులో తయారు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠాలోని శంకర్తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.