తెలంగాణ ప్రభుత్వం త్వరలో మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. అయితే.. సామాన్యులు ఎక్కువగా తాగే మద్యం ధరలు పెంచే ఆలోచన లేనట్లు సమాచారం. అధిక ధరల మద్యంపై అంటే బాటిల్ ధర రూ.500 కంటే ఎక్కువగా ఉన్న మద్యంపై 10 శాతం వరకు పెంపు ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 2000 కోట్ల అదనపు ఆదాయం రానుంది. టెట్రా ప్యాకెట్ల ద్వారా మద్యం అమ్మే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.