అటు ఏపీలో మందుబాబులకు కిక్కు దిగిపోయే బ్యాడ్ న్యూస్ వినిపించిందో లేదో.. తెలంగాణలోని మద్యం ప్రియులకు కూడా గుండెపగిలే వార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు అనుగుణంగానే.. బీర్ల ధరలను 15 శాతం పెంచుతు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణయం ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.