మందుబాబులకు చేదు వార్త.. తెలంగాణలో మద్యం ధరల సవరణపై కసరత్తు, పెంపు ఎంతంటే..?

3 days ago 5
తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది చేదువార్తే. రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరల సవరణపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల దృష్ట్యా మద్యం ధరలను కనీసం 10 శాతం పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తుండగా.. ధరలు పెంచితే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి సరిహద్దుల ద్వారా అక్రమ మద్యం రవాణా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సునీల్ కిషోర్ జైస్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సంప్రదింపులు జరుపుతోంది.
Read Entire Article