రాష్ట్రంలో మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి అయినట్లు సమాచారం. మద్యం ధరల పెంపునకు సంబంధించి.. ఇప్పటికే కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మద్యం తయారీ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. కమిటీ సిఫార్సుల కంటే తక్కువగానే ప్రభుత్వం ధరలు పెంచనుంది.