జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్, లెక్కింపు తేదీల సందర్భంగా అధికారులు మద్యం దుకాణాలను మూసివేశారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం.. పోలీగ్ రోజున అంటే నవంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు.. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు రోజున వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాంతిభద్రతల కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ (నవీన్ యాదవ్), బీఆర్ఎస్ (మాగంటి సునీత), బీజేపీ (లంకల దీపక్ రెడ్డి) హోరాహోరీగా పోటీపడుతున్నారు.