హైదరాబాద్లో తాగుబోతులకు పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని హెచ్చరించారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 30 ఎంజీ కంటే ఎక్కువ మోతాదులో మద్యం ఉన్నా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అడిషనల్ డీసీపీ రామదాసు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.