మక్కాజిపల్లి - ధర్మవరం సెక్షన్లో డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. దీంతో పెనుకొండ - ధర్మవరం రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టు పూర్తైనట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఎక్స్ వేదికగా ఫోటోలు, వివరాలను పంచుకుంది. ఈ మార్గంలో డబ్లి్ంగ్ పనులు పూర్తి కావటంతో పెనుకొండ, ధర్మవరం మధ్య ప్రయాణ సమయం తగ్గటంతో పాటుగా.. పట్టుపరిశ్రమ, చేనేత, చిరు వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటుందని.. రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. అనంతపురం,సత్యసాయి జిల్లావాసులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.