మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలు, కార్యకర్తల బెదిరింపుల వల్లే ఆ అభ్యర్థి మహదేవప్ప సూసైడ్ చేసుకున్నాడని.. బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే మహదేవప్ప ఆత్మహత్యకు సంబంధించి.. ఆయన భార్య క్లారిటీ ఇచ్చారు. అసలు ఏం జరిగింది అనేది ఆమె వెల్లడించారు.