తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చిన కష్టమంతా మగవారికే. దీంతో.. బస్సులో పురుషులు పడుతున్న బాధలను పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం బస్సుల్లో.. కండక్టర్లు, ప్రయాణికుల మధ్య జరిగే చిల్లర పంచాయితీలకు స్వస్తి చెప్పే మార్గాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇక.. హైదరాబాద్ సిటీ బస్సుల్లోనూ యూపీఐ పేమెంట్స్ చేసి టికెట్ కొనుక్కునే ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది.