Machilipatnam Shipbuilding And Ship Repairs Center: మచిలీపట్నం రూపురేఖలు మారబోతున్నాయి. అక్కడ కొత్తగా షిప్ బిల్డింగ్, రిపేర్ల కోసం సెంటర్ ఏర్పాటు చేయడానికి గ్రీన్సిగ్నల్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం మారిటైమ్ బోర్డుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మచిలీపట్నంలో షిప్బిల్డింగ్, రిపేర్ సౌకర్యాల ఏర్పాటు కోసం పలు సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అనుకున్నట్లుగానే మచిలీపట్నం వాసుల కల నెరవేరనుందని జనసేన పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు.. ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయంటున్నారు.