హైదరాబాద్ సరూర్ నగర్లో దోమల సమస్య తీవ్రం కావడంతో బీజేపీ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి నేతృత్వంలో వినూత్న నిరసన చేపట్టారు. ప్రజల నుంచి భిక్షాటన ద్వారా సేకరించిన డబ్బుతో దోమల తెరను కొనుగోలు చేసి.. ఎల్బీనగర్ మున్సిపల్ కార్యాలయం ముందున్న ఒక బొమ్మకు కప్పి నిరసన తెలిపారు. నగరంలో యాంటీ లార్వా చర్యలు, ఫాగింగ్ లేకపోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.