మణికొండలో హైడ్రా ఆపరేషన్.. 1.5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

4 weeks ago 6
హైదరాబాద్ శివార్లలోని మణికొండ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా బృందం భారీ ఆపరేషన్ నిర్వహించి 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. కోట్ల విలువైన ఈ భూమిని కబ్జాదారులు ఆక్రమించుకున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకుని, ఆక్రమణలను తొలగించి బోర్డులు ఏర్పాటు చేశారు. భూములను, చెరువులను కబ్జా చేస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని అధికారులు హెచ్చరించారు.
Read Entire Article