ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తీవ్ర సంచలనం సృష్టించిన కోవా బన్ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదానికి మతం రంగు పూయడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చిన ఓ చిన్న వ్యాపారి కోవా బన్ అమ్ముకుని జీవిస్తుంటే.. దాన్ని మతానికి ముడిపెట్టి విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు.