ఏపీలో మరో అమానుష ఘటన జరిగింది. మదనపల్లె ఘటన మరిచిపోకముందే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో నాలుగేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి యత్నించడం కలకలం రేపింది. 4 ఏళ్ల వయసు ఉన్న చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కూలీ పనుల కోసం నిందితుడు వేరే ఊరి నుంచి అక్కడికి వచ్చినట్లు తెలిసింది. బాలికను వైద్య పరీక్షలకు పంపించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.