మదనపల్లెలో జరిగిన వరుస చోరీల ఘటనలో ఓ మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఐటీ జాబ్ చేసిన రాజేష్ అనే వ్యక్తి.. కరోనా సమయంలో జాబ్ కోల్పోయాడు. దీంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు దొంగగా మారాడు. ఇతనిపై రెండు చైన్ స్నాచింగ్ కేసులు, ఓ దొంగతనం కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాజేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి బంగారం. వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు.