వైఎస్సార్ సీపీ పాలనలో ఏపీ ఆర్థికంగా నష్టపోయిందని, జగన్ ఏపీ బ్రాండ్ దెబ్బతీశారని నారా లోకేష్ ఆరోపించారు. సింగపూర్ పర్యటనలో 45 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మద్యం కేసులో జగన్ అరెస్టుపై చట్టం తన పని చేసుకుపోతుందన్నారు. పెద్దిరెడ్డిపై పాత కక్షలుంటే 2014-19 మధ్య బయట తిరిగేవారా అని ప్రశ్నించారు. మురళీకృష్ణ అనే వ్యక్తి పెట్టుబడులు రాకుండా ఈ-మెయిల్ పంపించాడని, అతనికి వైఎస్సార్ సీపీతో సంబంధాలున్నాయని లోకేష్ ఆరోపించారు.