సిగిరెట్ తాగడానికి అగ్గిపెట్టె అడగడంతో మొదలైన గొడవ చివరికి కత్తి తీసుకుని హత్య చేసే వరకూ వెళ్లింది. ఈ ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం వెల్లబాడు గ్రామంలో చోటుచేసుకుంది. ఇద్దరూ మద్యం మత్తులో ఉండటమే ఈ ఘటనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గొడవ జరిగిన సమయంలో స్థానికులు సర్ది చెప్పి పంపించినా.. మళ్లీ తిరిగి గొడవ పడి ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.