ఏపీ ప్రజలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభవార్త వినిపించారు. విద్యుత్ వినియోగదారులపై కరెంట్ బిల్లుల భారం తగ్గిస్తామని ప్రకటించారు. బుధవారం రోజున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కరెంట్ బిల్లుల భారం తగ్గిస్తామని తెలిపారు. మరోవైపు అనకాపల్లి పర్యటన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు.