తెలంగాణలో విద్యారంగం రూపురేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో కొత్త గదుల నిర్మాణం, ప్రత్యేక అవసరాల పిల్లల కోసం వసతులు కల్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో సోలార్ కిచెన్ల ఏర్పాటు, పదో తరగతి తర్వాత విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించడంపై దృష్టి సారించారు. ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందిస్తూ, నైపుణ్యాభివృద్ధి కోర్సులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. జిల్లాల కలెక్టర్లు పాఠశాలలను సందర్శించి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.