ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో పలు సర్వే నెంబర్లలోని అక్రమ నిర్మాణాలను కాప్రా తహసీల్దార్ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసు పహారా మధ్య జేసీబీలతో నేలమట్టం చేశారు. మరోవైపు.. కూకట్పల్లి నల్ల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న గుడిసెలను హైడ్రా అధికారులు తొలగించారు. ఎటువంటి సమాచారం లేకుండా కూల్చుతున్నారని స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా.. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.