కీసర మండలం కొత్తపేటకు చెందిన 91 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు తన ఇంటిని పెద్ద మనవడు శ్రీనివాస్కు 2018లో గిఫ్ట్ డీడ్గా రాసిచ్చారు. అయితే.. కొద్ది నెలలకే మనవడు తాతను ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో రాములు వృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం మేడ్చల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ గిఫ్ట్ డీడ్ను రద్దు చేశారు. ఈ రద్దుపై శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించినా.. తాతను పోషించాలనే నిబంధన లేకపోయినా నిర్లక్ష్యం చేసినందుకు రద్దు సబబేనని హైకోర్టు తీర్పు చెప్పింది.