తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుపై కూటమి నేతల వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పవన్ కల్యాణ్, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు రగిలిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా జరిగిన విభజనను తక్కువ చేస్తూ మాట్లాడటం మానుకోవాలని.. సీనియర్ నేతగా చంద్రబాబు తన భాగస్వామ్య పక్షాలను నియంత్రించాలని ఈ లేఖ ద్వారా కోరారు.