గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం FTL పరిధిలో నివాసం ఉంటున్న వారి ఇళ్ల జోలికెళ్లబోమని చెప్పారు. మనసు చంపుకొని కూల్చివేతలు చేపట్టామని.. మానవత్వ కోణంలో ఆలోచిస్తే సమాజానికి నష్టం జరుగుతుందని అన్నారు. ఒక ఉద్యమంగా చెరువుల పరిరక్షణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.