పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తల్లీ, సోదరుడిని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో శ్రీనివాస్ అనే నిందితుణ్ని భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి, తమ్ముడిని హత్య చేసిన తర్వాత శ్రీనివాస్ నేరుగా పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అనంతరం పోలీసుల వద్ద శ్రీనివాస్ పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవటమే హత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.