మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌.. సౌత్ సెంట్రల్ రైల్వే కీలక అప్డేట్

7 months ago 12
మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు అంచనా వ్యయం గణనీయంగా పెరిగింది. 2015లో రూ. 1,160 కోట్లుగా ఉన్న ఈ వ్యయం ఇప్పుడు రూ. 2,780 కోట్లకు చేరుకుంది. మొత్తం 151 కి.మీ. మార్గంలో కేవలం 76 కి.మీ. మాత్రమే పూర్తయింది. ఈ జాప్యానికి ప్రధాన కారణం భూసేకరణలో ఆలస్యం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 926.93 కోట్లు భరించాలి. ఇందులో ఇప్పటికే రూ. 416 కోట్లు చెల్లించింది. మిగతా రూ. 510.93 కోట్లు డిపాజిట్ చేయాలని రైల్వే శాఖ కోరింది. ఈ మార్గం పూర్తయితే మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు రైలు అనుసంధానం లభిస్తుంది.
Read Entire Article