తమిళనాడు, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీల ఓటమిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. ఎస్ఐఆర్, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగానే ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ స్టాలిన్, మమతా బెనర్జీ ఓటములను జగన్ విశ్లేషించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు.