మమ్మల్ని చంపి తర్వాత కంపెనీ పెట్టండి.. మరోసారి ఆందోళనలు

6 months ago 10
బల్క్‌డ్రగ్ పార్క్ వచ్చి రోగాలతో మరణించడం కన్నా.. ముందే పోలీసులు గన్‌లతో కాల్చి చంపేయండి అంటూ రాజయ్యపేట మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్‌డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న సామూహిక నిరాహారదీక్షలు 33వ రోజుకు చేరాయి. హెటిరో డ్రగ్ పరిశ్రమ వలన మరణించిన మృతుల ఫోటోలతో ప్రజలు నిరసన తెలియజేశారు. ఒక్క పరిశ్రమ వల్లే తమ గ్రామంలో 20 మంది చనిపోయారంటూ ఆందోళన చేశారు. అలాంటిది కొన్ని వందల మెడికల్ కంపెనీలు ఇక్కడికి వస్తే గ్రామంలోని ప్రజలంతా రోగాలతో చనిపోవాలా అని.. ప్రభుత్వాని ప్రశ్నించారు.
Read Entire Article