Vizianagaram Medical Student Suicide Letter: 'అమ్మ, నాన్నా, తమ్ముడూ నన్ను క్షమించండి. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. ఎంత కష్టపడి చదువుదామన్నా చదవలేక పోతున్నా. భయం ఎందుకు ఎక్కువై పోతుందో తెలియడం లేదు. గత 8-9 నెలల నుంచి ఆత్మహత్య ఆలోచనలు తినేస్తున్నాయ్' అంటూ వైద్య విద్యార్థి రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థి ఆత్కూరి సాయిమణిదీప్ హాస్టల్ గదిలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ సూసైడ్ నోట్ రాసి కుటుంబ సభ్యుల్ని క్షమించమని కోరాడు.