మయన్మార్లో భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. మయన్మార్, థాయిలాండ్తో పాటుగా భారతదేశంలోనూ పలుచోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో భూకంపం వచ్చేందుకు ఉన్న అవకాశాలు, వస్తే ఎంత తీవ్రత ఉండొచ్చనే దానిపై అనుమానాలు, చర్చ మొదలైంది.