నల్గొండ జిల్లా, చిట్యాల పట్టణంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ వైన్ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు. షాపు షటర్లను పగలగొట్టి, రూ. 25 వేల నగదుతో పాటు రెండు బీర్ బాటిళ్లను దొంగిలించారు. హైవేపై నిత్యం రద్దీ ఉండే ప్రాంతంలో ఉన్న వైన్ షాపులో ఇలా షట్టర్లు పగలకొట్టి మరీ దొంగతనానికి పాల్పడటం స్థానికంగా సంచలనంగా మారింది. వైన్ షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.