తిరుమలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన ఆలోచన చేస్తోంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో.. తిరుమలలోనూ ప్రత్యేక చట్టం తెచ్చే ఆలోచన చేస్తోంది. స్వర్ణ దేవాలయం చట్టాన్ని అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డిక్లరేషన్ అంశాన్ని పక్కాగా అమలయ్యేలా చూడాలని భావిస్తోంది. ఈ అంశాలపై చంద్రబాబు.. సోమవారం మంత్రులతో చర్చించారు.