ఎస్ఎల్బీసీ ప్రస్తుత పరిస్థితి వెనుక కేసీఆర్ ఉన్నది నిజం కాదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోయినందుకే ఇప్పుడు టన్నెల్ కుప్పకూలిందని చెప్పుకొచ్చారు. టన్నెల్లో 8 మంది మృతి చెందడానికి కేసీఆరే కారణమని చెప్పుకొచ్చారు. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా., మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ను నమ్మినందుకే పాలమూరు కూడా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. పాలమూరు రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నారని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. మహిళలు ఆశీర్వదిస్తే తాను మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు మళ్లిస్తోందంటే అందుకు కేసీఆరే కారణమని చెప్పారు. అప్పట్లో 811 టీఎంసీల్లో 511 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లాలని కేసీఆర్ సంతకం చేశారని తెలిపారు. అదే ఇప్పుడు తెలంగాణ రైతులకు శాపంగా మారిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.