నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. సోమశిల చూపిస్తానని నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. ఆపై పెట్రోల్ పోసి కాల్చివేశాడు. బాధితురాలు కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.