తెలంగాణలో గర్భిణులు, బాలింతలకు ఆర్థిక చేయూతనిస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి మాతృ వందన యోజనను రాష్ట్రంలోనూ అమలు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా తొలి కాన్పునకు రూ.5 వేలు, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అదనంగా రూ.6 వేలు అందజేస్తారు. ఈ పథకం అమలు బాధ్యతలను శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షించనుంది.