మరో మూడు రోజులు ఇంతే.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

4 hours ago 3
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్‌లోనే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 174 మండలాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. మరో మూడు రోజులు ఇదే రీతిలో ఎండలు దంచికొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.
Read Entire Article