తెలంగాణలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతీష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రజా పాలనలో భాగంగా.. వీటికి దరఖాస్తులు స్వీకరించారు. వీరిలోని అర్హులను ఎంపిక చేసి.. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లుగా విభజించారు. ప్రస్తుతం సొంత స్థలం ఉండి.. దానిలో ఇంటిని నిర్మించే వారిని మొదటి లిస్ట్ కింద విభజించారు. ప్రస్తుతం చాలామంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున నిధులు కూడా జమ అయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఇంటి నిర్మాణాలు కూడా పూర్తి చేసి.. గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నారు.