Stree Shakti Scheme from August 15 in Andhra Pradesh: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. ఆగస్ట్ 15 నుంచి స్త్రీ శక్తి పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6700 బస్సులలో ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మంగళవారం జరిగే ఏపీ కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.